BREAKING
గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం గుడిపాల మండలంలో అక్రమ ఇసుక తరలింపు.. ముగ్గురిపై కేసు బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన చిర్ల జగ్గిరెడ్డి చిత్తూరు లో నాణ్యతలేని అంగన్వాడి పాలు చిత్తూరు జిల్లా పరిధిలో యాదవ సంఘ నూతన కమిటీలు అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి జగన్‌ను కలిసిన అమలాపురం కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ తమ్మన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన చిర్ల జగ్గిరెడ్డి మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం
www.ntodaynews.com

అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి

ఆంధ్రప్రదేశ్
/ చిత్తూరు
Reporter
P. kishore Chittoor Constituency Reporter
19 Aug, 2026 - 11:49 AM
54 వీక్షణలు

అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి

చిత్తూరు: నగర పరిధిలోని నరిగపల్లి–తాళంబేడు ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రమాదకరంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారని వారు తెలిపారు.

ఏళ్లుగా రహదారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా నరిగపల్లి–తాళంబేడు రహదారికి మాత్రం మోక్షం లభించడం లేదని వాపోతున్నారు.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని పరిశీలించి, గుంతలను పూడ్చడంతో పాటు నాణ్యమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.