అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి
అధ్వానంగా మారిన నరిగపల్లి–తాళంబేడు రహదారి
చిత్తూరు: నగర పరిధిలోని నరిగపల్లి–తాళంబేడు ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రమాదకరంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారని వారు తెలిపారు.
ఏళ్లుగా రహదారి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా నరిగపల్లి–తాళంబేడు రహదారికి మాత్రం మోక్షం లభించడం లేదని వాపోతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని పరిశీలించి, గుంతలను పూడ్చడంతో పాటు నాణ్యమైన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఈ రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.