BREAKING
ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అంటే అమ్మ ఒడిలాంటిది జూన్ 12న పాఠశాలలలో విద్యార్థులతో ప్రతిజ్ఞ పోలవరం గ్రామంలో వీధి కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ విగ్రహానికి 46వ వారం జ్ఙానమాల కార్యక్రమం.. అనంతపురంలో ఏసీబీ వలలో మున్సిపల్ అధికారులు 22-A భూ సమస్యల పరిష్కారం!… రైతులకు, ప్రజలకు ఊరట! చెక్కపల్లిలో భూదాన భూములను గుర్తించి పేదలకు పంచాలి ఏలూరు జిల్లాలో అక్రమ PDS మాఫియా కలకలం కన్నుల పండుగగా శ్రీ మహాలింగేశ్వర స్వామి కళ్యాణం రైతుల పక్షాన పోరాడుతా.. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
www.ntodaynews.com

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:23 PM
158 వీక్షణలు

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు
పేస్ రీడింగ్ సమస్యలతో పనికి దూరమైన కూలీలు

ముసునూరు మండలం 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలులో ఉన్న వి.బి.జి. రాంజీ పథకం కింద కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో సిపిఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల బక్కయ్య, ఆముదాల లక్ష్మయ్య ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు.

ఎన్ఎస్పి కాలువ పూడిక పనులకు వెళ్లిన ఈ కూలీలు పేస్ రీడింగ్ యాప్ ద్వారా ఫోటోలు అప్లోడ్ చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి హాజరు నమోదు కాలేదు. ఎంత ప్రయత్నించినా ఫోటోలు తీసుకోవడం సాధ్యం కాకపోవడంతో “ఈరోజు పనిలేదు, ఇంటికి వెళ్లండి” అని అధికారులు చెప్పినట్లు వారు ఆరోపించారు.

కూలీల డిమాండ్లు

ఈ సందర్భంగా బక్కయ్య మాట్లాడుతూ:

  • జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేయాలి
  • వి.బి.జి. రాంజీ పథకాన్ని రద్దు చేయాలి
  • సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • రోజుకు రూ.600 కూలీ చెల్లించాలి
  • సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించాలి
  • కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఈ కార్యక్రమంలో వేముల చంటి, వేముల మహాలక్ష్మి, ఆముదాల చినబాబు, నంది పాము రాణి, పల్లెపాము భవాని తదితరులు పాల్గొన్నారు.