BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:23 PM
199 వీక్షణలు

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు
పేస్ రీడింగ్ సమస్యలతో పనికి దూరమైన కూలీలు

ముసునూరు మండలం 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలులో ఉన్న వి.బి.జి. రాంజీ పథకం కింద కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో సిపిఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల బక్కయ్య, ఆముదాల లక్ష్మయ్య ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు.

ఎన్ఎస్పి కాలువ పూడిక పనులకు వెళ్లిన ఈ కూలీలు పేస్ రీడింగ్ యాప్ ద్వారా ఫోటోలు అప్లోడ్ చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి హాజరు నమోదు కాలేదు. ఎంత ప్రయత్నించినా ఫోటోలు తీసుకోవడం సాధ్యం కాకపోవడంతో “ఈరోజు పనిలేదు, ఇంటికి వెళ్లండి” అని అధికారులు చెప్పినట్లు వారు ఆరోపించారు.

కూలీల డిమాండ్లు

ఈ సందర్భంగా బక్కయ్య మాట్లాడుతూ:

  • జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేయాలి
  • వి.బి.జి. రాంజీ పథకాన్ని రద్దు చేయాలి
  • సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • రోజుకు రూ.600 కూలీ చెల్లించాలి
  • సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించాలి
  • కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఈ కార్యక్రమంలో వేముల చంటి, వేముల మహాలక్ష్మి, ఆముదాల చినబాబు, నంది పాము రాణి, పల్లెపాము భవాని తదితరులు పాల్గొన్నారు.