BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:23 PM
284 వీక్షణలు

వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు
పేస్ రీడింగ్ సమస్యలతో పనికి దూరమైన కూలీలు

ముసునూరు మండలం 

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమలులో ఉన్న వి.బి.జి. రాంజీ పథకం కింద కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు డివిజన్ ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో సిపిఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల బక్కయ్య, ఆముదాల లక్ష్మయ్య ఉపాధి కోల్పోయినట్లు తెలిపారు.

ఎన్ఎస్పి కాలువ పూడిక పనులకు వెళ్లిన ఈ కూలీలు పేస్ రీడింగ్ యాప్ ద్వారా ఫోటోలు అప్లోడ్ చేసే సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి హాజరు నమోదు కాలేదు. ఎంత ప్రయత్నించినా ఫోటోలు తీసుకోవడం సాధ్యం కాకపోవడంతో “ఈరోజు పనిలేదు, ఇంటికి వెళ్లండి” అని అధికారులు చెప్పినట్లు వారు ఆరోపించారు.

కూలీల డిమాండ్లు

ఈ సందర్భంగా బక్కయ్య మాట్లాడుతూ:

  • జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేయాలి
  • వి.బి.జి. రాంజీ పథకాన్ని రద్దు చేయాలి
  • సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
  • రోజుకు రూ.600 కూలీ చెల్లించాలి
  • సంవత్సరానికి కనీసం 200 రోజుల పని కల్పించాలి
  • కార్మికులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

ఈ కార్యక్రమంలో వేముల చంటి, వేముల మహాలక్ష్మి, ఆముదాల చినబాబు, నంది పాము రాణి, పల్లెపాము భవాని తదితరులు పాల్గొన్నారు.