చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో చనుబండ సెంటర్ ప్రధాన కూడలిలో వేపచెట్టు దగ్గర కొలువైయున్న శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి బొడ్డు రాయిని ప్రతిష్టించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. అలాగే, శ్రీశ్రీశ్రీ కోనేరు అభయ ఆంజనేయస్వామి ఆలయము నందు ఆంజనేయ స్వామి వాహనం అయిన ఒంటె మరియు కోనేరు తూర్పు కట్టమీద శివలింగం, నందిని ప్రతిష్టించుటకు విగ్రహాలను తీసుకురావడమే కాకుండా వాటిని పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి ఆలయము నందు గల గదిలో ధాన్యంలో భద్రపరిచి పునప్రతిష్ట కార్యక్రమం కోసం సన్నాహాలు చేయబడ్డాయి. ఈ విగ్రహాలను జులై 11న పునప్రతిష్ట చేయాలని ఆలయ ధర్మకర్త పుచ్చకాయల చెన్నకేశవరెడ్డి తెలియజేశారు.