BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 06:07 PM
113 వీక్షణలు

ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత: లారీలు నిలిచిపోతున్నాయి, రైతులు ఇబ్బందులు

ఏలూరు జిల్లా మైదానంలో ధాన్యం లోడింగ్ జరుగుతున్న సమయంలో ట్రక్ షీట్ల కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. ట్రక్ షీట్ల లభ్యం లేకుండా లారీలు నిలిచిపోతున్నాయి, దీంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ధాన్యం లోడింగ్ చేసే హమాలీలు కూడా లభించకపోవడంతో, రైతులు తమకు సంబంధించిన లారీలు ఎక్కడున్నా అక్కడే నిలబడి పోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోని సంచులతో పట్టుకుని కాటాలు వేయించుకుంటున్న హమాలీలు, సాయంత్రం 6 గంటల సమయానికి ట్రక్ షీట్లు ఇచ్చే కంప్యూటర్ ఆపరేటర్లు పని ముగించుకుని వెళ్లిపోతున్నారు.

లారీ ఓనర్లు చెబుతున్నట్లు, ఒక ధాన్యం లోడు రవాణా చేయాలంటే కనీసం రెండు రోజులు సమయం పడుతోంది. అటు, లారీ ఓనర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆవేదన చెందుతుంటే, మరో పక్క లోడైన లారీలు ట్రక్ షీట్ల లేకుండా అక్కడే నిలిచి పోతున్నాయి.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో లారీ డ్రైవర్లకు తాగడానికి మంచినీరు, భోజనం సకాలంలో అందకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితులపై జిల్లా అధికారులు స్పందించి, వెంటనే ట్రక్ షీట్ల పంపిణీని సులభతరం చేయాలని, తద్వారా లారీ యాజమాన్యం, రైతులు, డ్రైవర్లకు కనీసం కొంత ఉపశమనం లభించాలని కోరుకుంటున్నారు.