BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 06:07 PM
52 వీక్షణలు

ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత: లారీలు నిలిచిపోతున్నాయి, రైతులు ఇబ్బందులు

ఏలూరు జిల్లా మైదానంలో ధాన్యం లోడింగ్ జరుగుతున్న సమయంలో ట్రక్ షీట్ల కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. ట్రక్ షీట్ల లభ్యం లేకుండా లారీలు నిలిచిపోతున్నాయి, దీంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ధాన్యం లోడింగ్ చేసే హమాలీలు కూడా లభించకపోవడంతో, రైతులు తమకు సంబంధించిన లారీలు ఎక్కడున్నా అక్కడే నిలబడి పోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోని సంచులతో పట్టుకుని కాటాలు వేయించుకుంటున్న హమాలీలు, సాయంత్రం 6 గంటల సమయానికి ట్రక్ షీట్లు ఇచ్చే కంప్యూటర్ ఆపరేటర్లు పని ముగించుకుని వెళ్లిపోతున్నారు.

లారీ ఓనర్లు చెబుతున్నట్లు, ఒక ధాన్యం లోడు రవాణా చేయాలంటే కనీసం రెండు రోజులు సమయం పడుతోంది. అటు, లారీ ఓనర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆవేదన చెందుతుంటే, మరో పక్క లోడైన లారీలు ట్రక్ షీట్ల లేకుండా అక్కడే నిలిచి పోతున్నాయి.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో లారీ డ్రైవర్లకు తాగడానికి మంచినీరు, భోజనం సకాలంలో అందకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితులపై జిల్లా అధికారులు స్పందించి, వెంటనే ట్రక్ షీట్ల పంపిణీని సులభతరం చేయాలని, తద్వారా లారీ యాజమాన్యం, రైతులు, డ్రైవర్లకు కనీసం కొంత ఉపశమనం లభించాలని కోరుకుంటున్నారు.