BREAKING
​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత ​మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు ​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత ​మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు
www.ntodaynews.com

ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 06:07 PM
30 వీక్షణలు

ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత: లారీలు నిలిచిపోతున్నాయి, రైతులు ఇబ్బందులు

ఏలూరు జిల్లా మైదానంలో ధాన్యం లోడింగ్ జరుగుతున్న సమయంలో ట్రక్ షీట్ల కొరత తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. ట్రక్ షీట్ల లభ్యం లేకుండా లారీలు నిలిచిపోతున్నాయి, దీంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు.

ధాన్యం లోడింగ్ చేసే హమాలీలు కూడా లభించకపోవడంతో, రైతులు తమకు సంబంధించిన లారీలు ఎక్కడున్నా అక్కడే నిలబడి పోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గోని సంచులతో పట్టుకుని కాటాలు వేయించుకుంటున్న హమాలీలు, సాయంత్రం 6 గంటల సమయానికి ట్రక్ షీట్లు ఇచ్చే కంప్యూటర్ ఆపరేటర్లు పని ముగించుకుని వెళ్లిపోతున్నారు.

లారీ ఓనర్లు చెబుతున్నట్లు, ఒక ధాన్యం లోడు రవాణా చేయాలంటే కనీసం రెండు రోజులు సమయం పడుతోంది. అటు, లారీ ఓనర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆవేదన చెందుతుంటే, మరో పక్క లోడైన లారీలు ట్రక్ షీట్ల లేకుండా అక్కడే నిలిచి పోతున్నాయి.

ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో లారీ డ్రైవర్లకు తాగడానికి మంచినీరు, భోజనం సకాలంలో అందకపోవడంతో వారు కూడా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితులపై జిల్లా అధికారులు స్పందించి, వెంటనే ట్రక్ షీట్ల పంపిణీని సులభతరం చేయాలని, తద్వారా లారీ యాజమాన్యం, రైతులు, డ్రైవర్లకు కనీసం కొంత ఉపశమనం లభించాలని కోరుకుంటున్నారు.