BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:11 PM
31 వీక్షణలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతి ఐ నుంచి కొత్త ఏవియేషన్ పాలసీ వరకు గ్రీన్ సిగ్నల్

అమరావతిలో ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అధ్యక్షతన జరిగిన 50వ కేబినెట్ సమావేశంలో 34 కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. అమరావతి అభివృద్ధి, పోలవరం, అవయవ మార్పిడి చట్టం, కొత్త ఏవియేషన్ పాలసీ, గ్రామీణ ఉపాధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, పర్యాటక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ముఖ్యాంశాలు ఇవే..

అమరావతిలో "అమరావతి ఐ" పేరుతో లండన్ ఐ తరహా భారీ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి అనుమతి.

అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ డ్యూటీ, ఫీజుల మినహాయింపు.

రాష్ట్రంలో అవయవ దానం, మార్పిడిని నియంత్రించేందుకు THOTA-2011 చట్టం అమలుకు ఆమోదం.

చీరాల, విశాఖపట్నంలో బీచ్ షాక్స్ పైలట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజ్-5, 5A పనులకు రూ.796.66 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతి.

అగ్రిగోల్డ్ కేసుల వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు 21 కొత్త పోస్టుల మంజూరు.

అమరావతి హైకోర్టు భవన బాహ్య అభివృద్ధి పనులకు రూ.547.07 కోట్ల ఆమోదం.

రాష్ట్రానికి కొత్త ఏవియేషన్ పాలసీ 2026-31కు కేబినెట్ ఆమోదం.

2035 నాటికి 9 కొత్త విమానాశ్రయాలు, 10 వాటర్‌డ్రోమ్స్ ఏర్పాటు లక్ష్యం.

జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో VB-GRAMG ఉపాధి హామీ పథకం అమలు.

వివిధ జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల కోసం వందల ఎకరాల ప్రభుత్వ భూముల కేటాయింపు.

అమరావతిలో పలు ప్రభుత్వ, విద్యా, ప్రైవేటు సంస్థలకు భూకేటాయింపులపై కేబినెట్ ఆమోదం.

ఈ సమావేశంలో వ్యవసాయం, ఐటీ, ఆరోగ్యం, జలవనరులు, రెవెన్యూ, పరిశ్రమలు, పురపాలక, పంచాయతీరాజ్ తదితర శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.