BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 09:11 PM
41 వీక్షణలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతి ఐ నుంచి కొత్త ఏవియేషన్ పాలసీ వరకు గ్రీన్ సిగ్నల్

అమరావతిలో ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu అధ్యక్షతన జరిగిన 50వ కేబినెట్ సమావేశంలో 34 కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. అమరావతి అభివృద్ధి, పోలవరం, అవయవ మార్పిడి చట్టం, కొత్త ఏవియేషన్ పాలసీ, గ్రామీణ ఉపాధి, పారిశ్రామిక ప్రాజెక్టులు, పర్యాటక రంగాలకు సంబంధించిన ప్రతిపాదనలకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ముఖ్యాంశాలు ఇవే..

అమరావతిలో "అమరావతి ఐ" పేరుతో లండన్ ఐ తరహా భారీ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి అనుమతి.

అమరావతి క్వాంటమ్ వ్యాలీ కోసం 49.66 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌కు స్టాంప్ డ్యూటీ, ఫీజుల మినహాయింపు.

రాష్ట్రంలో అవయవ దానం, మార్పిడిని నియంత్రించేందుకు THOTA-2011 చట్టం అమలుకు ఆమోదం.

చీరాల, విశాఖపట్నంలో బీచ్ షాక్స్ పైలట్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.

పోలవరం ఎడమ ప్రధాన కాలువ ప్యాకేజ్-5, 5A పనులకు రూ.796.66 కోట్ల సవరించిన పరిపాలనా అనుమతి.

అగ్రిగోల్డ్ కేసుల వేగవంతమైన విచారణ కోసం ప్రత్యేక కోర్టుకు 21 కొత్త పోస్టుల మంజూరు.

అమరావతి హైకోర్టు భవన బాహ్య అభివృద్ధి పనులకు రూ.547.07 కోట్ల ఆమోదం.

రాష్ట్రానికి కొత్త ఏవియేషన్ పాలసీ 2026-31కు కేబినెట్ ఆమోదం.

2035 నాటికి 9 కొత్త విమానాశ్రయాలు, 10 వాటర్‌డ్రోమ్స్ ఏర్పాటు లక్ష్యం.

జూలై 1 నుంచి గ్రామీణ ప్రాంతాల్లో VB-GRAMG ఉపాధి హామీ పథకం అమలు.

వివిధ జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల కోసం వందల ఎకరాల ప్రభుత్వ భూముల కేటాయింపు.

అమరావతిలో పలు ప్రభుత్వ, విద్యా, ప్రైవేటు సంస్థలకు భూకేటాయింపులపై కేబినెట్ ఆమోదం.

ఈ సమావేశంలో వ్యవసాయం, ఐటీ, ఆరోగ్యం, జలవనరులు, రెవెన్యూ, పరిశ్రమలు, పురపాలక, పంచాయతీరాజ్ తదితర శాఖలకు సంబంధించిన పలు అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.