ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు
ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు
అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ సెలవులు అకడమిక్ కేలండర్ ప్రకారం జారీ చేయబడ్డాయి.
వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు సంబంధించి జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు ఇవ్వబడినట్లు విద్యాశాఖ ప్రకటించింది.
ప్రతీ విద్యా సంవత్సరం ముగింపు రోజున వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచన ఇచ్చింది.
విద్యార్థులకు, పెద్దల పర్యవేక్షణ లేకుండా కాలువలు, చెరువులు, నదులు, బావుల వద్దకు వెళ్లకుండా ఉండాలని, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకుండా ఉండాలని సూచించింది.
పాఠశాల నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను ప్రదర్శించాలనీ, తల్లిదండ్రులకు కూడా సూచనలు ఇవ్వాలని, పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని విద్యాశాఖ సూచించింది.