www.ntodaynews.com
ఏపీ సీఎస్ సాయిప్రసాద్కు పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. వాస్తవానికి ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వ అనుమతితో నవంబర్ 30 వరకు అదే పదవిలో కొనసాగనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా వ్యవహారాల్లో కొనసాగుతున్న కీలక ప్రక్రియలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ దృష్ట్యా ఆయన సేవలను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.