BREAKING
జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ జిల్లాలో మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి పరచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు ప్రభుత్వం రైతులను ఇబ్బందులు చేయకుండా మండలంలోని వరి ధాన్యం కొనుగోలు వేగం పెంచాలి ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరుగుతోంది – పలు జిల్లాలకు వడగాల్పుల హెచ్చరిక మహిళా ఉద్యోగుల భద్రతే మా లక్ష్యం మంచిర్యాల: గొంతులో ఇరుక్కున్న మటన్ ఎముక.. పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి – నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
www.ntodaynews.com

ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు – 38% వృద్ధి నమోదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 12:42 PM
12 వీక్షణలు

ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు – 38% వృద్ధి నమోదు

ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రానికి మొత్తం రూ.3,797 కోట్లు అందాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 38 శాతం వృద్ధిగా నమోదైంది.

సెటిల్మెంట్‌కు ముందు రాష్ట్ర ఆదాయం రూ.1,602 కోట్లుగా ఉండగా, సెటిల్మెంట్ అనంతరం అదనంగా రూ.2,195 కోట్లు చేరి మొత్తం ఆదాయం పెరిగింది. దేశవ్యాప్తంగా ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రాల ఆదాయం సగటున 40 శాతం పెరిగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో వృద్ధి ఆ స్థాయికి కొద్దిగా తగ్గుగా ఉంది.

ఇక దేశవ్యాప్తంగా చూస్తే, ఏప్రిల్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,42,702 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 8.7 శాతం అధికం. రిఫండ్లు రూ.31,793 కోట్లు తీసివేస్తే, నికర జీఎస్టీ వసూళ్లు రూ.2,10,909 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది కంటే 7.3 శాతం ఎక్కువ.