BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు – 38% వృద్ధి నమోదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 12:42 PM
91 వీక్షణలు

ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు – 38% వృద్ధి నమోదు

ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రానికి మొత్తం రూ.3,797 కోట్లు అందాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 38 శాతం వృద్ధిగా నమోదైంది.

సెటిల్మెంట్‌కు ముందు రాష్ట్ర ఆదాయం రూ.1,602 కోట్లుగా ఉండగా, సెటిల్మెంట్ అనంతరం అదనంగా రూ.2,195 కోట్లు చేరి మొత్తం ఆదాయం పెరిగింది. దేశవ్యాప్తంగా ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రాల ఆదాయం సగటున 40 శాతం పెరిగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో వృద్ధి ఆ స్థాయికి కొద్దిగా తగ్గుగా ఉంది.

ఇక దేశవ్యాప్తంగా చూస్తే, ఏప్రిల్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,42,702 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 8.7 శాతం అధికం. రిఫండ్లు రూ.31,793 కోట్లు తీసివేస్తే, నికర జీఎస్టీ వసూళ్లు రూ.2,10,909 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది కంటే 7.3 శాతం ఎక్కువ.