BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఏపీలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 09:40 PM
44 వీక్షణలు

ఏపీలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?.. ఆ ఒక్క కారణంతోనే కాస్త ఆలస్యంగా!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఎప్పుడనే చర్చ జరుగుతోంది.. ఓ వైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలవుతుండటంతో.. ఏపీలో విద్యార్థులు కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే మూల్యాంకనం (వాల్యూషన్) ప్రక్రియ పూర్తి చేయగా.. ప్రస్తుతం ఫలితాలను విడుదల చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16నాటికి ఇంటర్‌ ఫలితాలకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

ఏపీ ఇంటర్ బోర్డు అన్నీ కుదిరితే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను ఈ నెల 18 లేదా 19 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఆ దిశగా ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు.. అందుకే పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టిందని.. అందుకే మూల్యాంకనానికి కొంత ఆలస్యం జరిగింది అంటున్నారు. అందుకే ఫలితాలు కాస్త ఆలస్యం అయ్యాయంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలపై అధికారికంగా క్లారిటీ ఇస్తుంది అంటున్నారు.