BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

ఏపీలో కలకలం.. కడపలో 5 కరోనా కేసులు.. ఇద్దరి మృతిపై ప్రభుత్వ వివరణయ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 01:01 PM
18 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో కడప జిల్లాలో ఐదు కోవిడ్-19 కేసులు నమోదుకావడంతో రాష్ట్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇదే సమయంలో ఇద్దరు మరణించిన ఘటనపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారానికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం వెల్లడించిన వివరాల ప్రకారం, మరణించిన ఇద్దరూ ఇప్పటికే మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపింది. ప్రభుత్వానికి ఈ కేసులపై సమాచారం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేసింది.

నమోదైన ఐదు కరోనా కేసులపై ఆరోగ్యశాఖ నిరంతర నిఘా కొనసాగిస్తోందని పేర్కొంది. వైరస్‌లో కొత్త రూపాంతరాలు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు బాధితుల నమూనాలను పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు జన్యు విశ్లేషణ కోసం పంపించినట్లు వెల్లడించింది.

ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య అధికారులు సూచిస్తున్నారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతోందని వెల్లడించింది.