www.ntodaynews.com
కలికిరి గురుకులంలో మిగులు సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అన్నమయ్య జిల్లా కలికిరిలోని జ్యోతిబా ఫూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వై. సోమశేఖర్ తెలిపారు. 5, 6, 7వ తరగతుల్లో రెండేసి సీట్లు, 8వ తరగతి ఇంగ్లీష్ మీడియంలో రెండు మిగులు సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
అర్హత కలిగిన విద్యార్థినులు జూలై 13లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఎంపిక కోసం జూలై 15న ఉదయం 10.30 గంటలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు, తల్లిదండ్రులు మరిన్ని వివరాల కోసం 9000715637 నంబర్ను సంప్రదించాలని సూచించారు.