BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. 3,035 మంది టీచర్లపై బిహార్ ప్రభుత్వ చర్య

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jul, 2026 - 10:03 AM
18 వీక్షణలు

బిహార్‌లో నకిలీ ధ్రువపత్రాలతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినట్లు గుర్తించిన 3,035 మంది టీచర్లను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నియామకాలపై జరిగిన విచారణలో పలు అక్రమాలు వెలుగులోకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

2006 నుంచి 2015 మధ్య స్థానిక సంస్థల ద్వారా జరిగిన ఉపాధ్యాయ నియామకాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టగా, కొందరు అభ్యర్థులు నకిలీ కుల ధ్రువపత్రాలు, విద్యార్హత సర్టిఫికెట్లు, వయస్సు, దివ్యాంగ ధ్రువపత్రాలు తదితర పత్రాలను ఉపయోగించి ఉద్యోగాలు పొందినట్లు గుర్తించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో అర్హత లేని 3,035 మంది ఉపాధ్యాయులను ఉద్యోగాల నుంచి తొలగించినట్లు బిహార్ విద్యాశాఖ వెల్లడించింది. అలాగే వారికి గతంలో చెల్లించిన జీతభత్యాల మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి వసూలు చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

ఇకపై ప్రభుత్వ నియామకాలలో ఇలాంటి అక్రమాలు జరగకుండా ధ్రువపత్రాల పరిశీలనను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు.