www.ntodaynews.com
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టులు
జాతీయం
ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా మొత్తం 779 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నియామక ప్రకటన విడుదల చేసింది.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జులై 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి అభ్యర్థుల వయోపరిమితి 25 నుంచి 45 సంవత్సరాల వరకు ఉండగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టు స్థాయిని బట్టి నెలకు రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు వేతనంతో పాటు ఇతర అలవెన్సులు కూడా అందిస్తారు.
ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందే దరఖాస్తు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.