www.ntodaynews.com
ఇండియన్ నేవీలో 275 ఎస్ఎస్సీ ఆఫీసర్ పోస్టులు.. దరఖాస్తులకు ఆహ్వానం
జాతీయం
భారత నావికాదళం 2026 బ్యాచ్కు సంబంధించి 275 షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూలై 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు:
గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఈ/బీటెక్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
జూలై 2, 2002 నుంచి జూలై 1, 2008 మధ్య జన్మించిన వారు అర్హులు.
ఎంపిక విధానం: మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్లిస్ట్ చేసి, అనంతరం ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ద్వారా తుది ఎంపిక చేపడతారు.
అభ్యర్థులు అర్హతలు, విభాగాల వారీ పోస్టులు, ఇతర నిబంధనల వివరాలను అధికారిక నోటిఫికేషన్లో పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి.