ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
అమరావతి, మార్చి 22 రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
అనకాపల్లి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది.
పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 50–60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలవకూడదని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది.