www.ntodaynews.com
ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోంది: భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో భారత రాజ్యాంగానికి బదులుగా ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ నడుస్తోందని వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం కోర్టులు, రాజ్యాంగ వ్యవస్థలపై విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు.
గత రెండేళ్లుగా తనను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తోందని భూమన ఆరోపించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఫిర్యాదుదారుగా మారి కేసు నమోదు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు.
కోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేసినా ప్రభుత్వ వైఖరిలో మార్పు కనిపించడం లేదని, ‘రెడ్ బుక్’ ప్రభావం ఇంకా కొనసాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో చట్టబద్ధత, న్యాయ వ్యవస్థల గౌరవం కాపాడాలని డిమాండ్ చేశారు.