www.ntodaynews.com
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..
ఆంధ్రప్రదేశ్
/
విశాఖపట్నం
ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి..
విశాఖపట్నంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో అవినీతి అధికారిని పట్టుకున్నారు. అక్కయ్యపాలెం సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి పైలా రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.
సమాచారం మేరకు, రూ.80 వేల లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫిర్యాదు అందిన వెంటనే అధికారులు ఉచ్చుపన్ని ఈ దాడి నిర్వహించినట్లు తెలిసింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.