www.ntodaynews.com
ఐజెయూ నల్లగొండ జిల్లా కమిటీలో చిట్యాల జర్నలిస్టులకు స్థానం
తెలంగాణ
/
నల్గొండ
/
నకిరేకల్
ఐజెయూ నల్లగొండ జిల్లా కమిటీలో చిట్యాల జర్నలిస్టులకు స్థానం
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐ జె యు) నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక నకిరేకల్ నియోజక వర్గ కేంద్రం లో బుధవారం జరిగింది. ఈ కార్యవర్గం లోకి చిట్యాల కు చెందిన ఇరువురు సీనియర్ జర్నలిస్టులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.
జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణలు ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా చిట్యాల కు చెందిన ఏళ్ల బయన్న, సహాయ కార్యదర్శిగా పెద్ది నరేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో వీరు జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షునిగా, సహాయ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఎన్నికైన వీరికి పలువురు అభినందనలు తెలియజేశారు.