BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఐసీడీఎస్ కోడిగుడ్ల అక్రమ రవాణాపై మంత్రి పార్థసారధి ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Jun, 2026 - 01:15 PM
69 వీక్షణలు

ఏలూరు జిల్లా, నూజివీడు: డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో అందిన ఫిర్యాదు మేరకు నూజివీడు మండలం తుక్కులూరు గ్రామంలో ఐసీడీఎస్‌కు సరఫరా చేయాల్సిన కోడిగుడ్ల అక్రమ రవాణా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దృష్టికి రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తీసుకెళ్లారు.

ఫిర్యాదుపై స్పందించిన మంత్రి పార్థసారధి ఐసీడీఎస్ కోడిగుడ్ల అక్రమ రవాణాపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత కాంట్రాక్టును రద్దు చేసే అంశాన్ని పరిశీలించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు సూచించారు.

పిల్లల పోషకాహారానికి ఉద్దేశించిన సరుకుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అక్రమాలను సహించబోమని మంత్రి స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.