గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత
గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద అక్రమ బియ్యం పట్టివేత
గుడిపాల మండలం బొమ్మసముద్రం వద్ద తమిళనాడు నుంచి తరలిస్తున్న మినీ కంటైనర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా 45 బస్తాల అక్రమ బియ్యం పట్టుబడింది. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.90,000 ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఎస్ఐకు అందిన సమాచారం మేరకు పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా, తమిళనాడులోని రాణిపేటకు చెందిన ప్రవీణ్ మినీ కంటైనర్ వాహనంలో 45 బస్తాల బియ్యాన్ని తమిళనాడు నుంచి తరలిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు వాహనాన్ని నిలిపేందుకు ప్రయత్నించగా, నిందితుడు ప్రవీణ్ వాహనాన్ని అక్కడే వదిలి పరారైనట్లు తెలిపారు.
పోలీసు సిబ్బంది మినీ కంటైనర్ వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.