BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

అక్రమ సారాయి కట్టడి… నల్లబెల్లం భారీగా పట్టివేత

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 08:23 PM
106 వీక్షణలు

అక్రమ సారాయి కట్టడి… నల్లబెల్లం భారీగా పట్టివేత

మహబూబాబాద్ జిల్లా: అక్రమ సారాయి తయారీపై పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ స్థాయిలో నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు.

టాస్క్ ఫోర్స్ మరియు కురవి పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఈ దాడిలో, అక్రమ సారాయి తయారీకి వినియోగించే నల్లబెల్లాన్ని లారీ ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కురవి శివారు సోమ్లా తండా వద్ద లారీని అడ్డగించి తనిఖీ చేపట్టారు.

తనిఖీలో సుమారు రూ.8 లక్షల విలువైన 70 క్వింటాళ్ల నల్లబెల్లం, 10 క్వింటాళ్ల పట్టికను గుర్తించారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశారు.

ఈ ఘటనలో గుగులోత్ సుమన్ (మహబూబాబాద్), ఆరెపల్లి మధు, బొల్లా విజయ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆపరేషన్‌లో టాస్క్ ఫోర్స్ సీఐ హతీరామ్, ఎస్‌ఐ తాహేర్ బాబా, కురవి ఎస్‌ఐ గండ్రాతి సతీష్, ఎస్‌ఐ జయకుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది సమ్మయ్య, హరిబాబు, నరేష్, బద్రు, బాబు పాల్గొన్నారు.