అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ ఆశ.. భర్త హత్య.. కూతురు చర్యతో తల్లి ఆత్మహత్య
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో, రిటైర్డ్ జవాన్ సందీప్ మంజరగి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న భార్య సుమ, ఆమె ప్రియుడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, భర్త వద్ద పనిచేసే యువకునితో సుమ అక్రమ సంబంధం పెట్టుకుని, భర్త పేరుపై ఉన్న రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం సెలైన్లో విషం ఎక్కించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనతో కుటుంబం తీవ్ర అపకీర్తి పాలవడంతో, సుమ తల్లి మహాదేవి తీవ్ర మనోవేదనకు గురైంది. కూతురు వ్యవహారంపై గ్రామంలో చర్చలు జరుగుతుండటంతో మానసికంగా కుంగిపోయిన ఆమె, హుక్కేరి తాలూకాలోని ఘోడగేరి గ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబాన్ని కుదిపేసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.