BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

తల్లికి వందనం నిధుల విడుదలకు లైన్ క్లియర్.

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
05 Apr, 2026 - 11:26 AM
50 వీక్షణలు

అమ్మలకి గొప్ప శుభవార్త...తల్లికి వందనం నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి రూ.15 వేలు... 

తల్లికి వందనం పథకం డబ్బులు ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయనే దానిపై కూటమి సర్కార్ క్లారిటీ ఇచ్చింది

వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి నిధుల విడుదలకు ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ప్రకటించారు

జూన్‌లో తల్లికి వందనం

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లికి వందనం నిధులను జూన్‌లో తల్లిదండ్రుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వేసవి సెలవుల తర్వాత జూన్‌లో స్కూల్స్, కాలేజీలు ప్రారంభమవుతాయి. దీంతో విద్యా సంవత్సరం మొదట్లోనే నిధులు రిలీజ్ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లులన్నా అందరికీ వర్తింపచేయనున్నారు. ఎలాంటి కొతలు ఉండవని, లబ్దిదారులందరికీ అందుతాయని స్పష్టం చేశారు. ఇక విద్యార్థులకు తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుడి అకౌంట్లో వీటిని జమ చేస్తారు. అయితే తల్లికి వందనం నిధులు జమ కావాలంటే.. విద్యార్థికి 75 శాతం అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. విద్యార్థి తల్లికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఆధార్‌తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అయితే విద్యార్థుల నిర్వహణ ఖర్చుల కోసం రూ.2 వేలు కట్ చేసి రూ.13 వేలు అకౌంట్ల జమ అవుతాయి. విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు భారం కూకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది. గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఈ స్కీమ్ అమలు చేసింది.