BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అమరావతి అజరామరం – సంబరాల్లో చనుబండ

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 08:48 PM
343 వీక్షణలు

అమరావతి అజరామరం – సంబరాల్లో చనుబండ

దేవతల రాజధానిగా చరిత్రలో వెలుగొందిన అమరావతి తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి అజరామరంగా నిలవాలని నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

గురువారం సాయంత్రం చనుబండలో కూటమి నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో పార్లమెంట్‌లో అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. టపాసులు కాల్చుతూ, మిఠాయిలు పంచుకుంటూ ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అమరావతికి చట్టబద్ధత లభించడం పట్ల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా మోరంపూడి మాట్లాడుతూ… 2014లో విభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించి, సుమారు 29 వేల మంది రైతుల నుంచి 34 వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించి నిర్మాణ పనులు ప్రారంభించినట్లు గుర్తుచేశారు. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానుల ప్రతిపాదనతో రాష్ట్రాన్ని అయోమయంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అమరావతికి భూములు ఇచ్చిన రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసినట్లు ఆరోపిస్తూ, ఆ అన్యాయాలపై ప్రజలు గట్టిగా స్పందించి వైసీపీని ఘోరంగా తిరస్కరించారని పేర్కొన్నారు. ఇకపై ఎవ్వరూ అమరావతి రాజధానిని కదిలించలేరని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలని, అందుకోసం నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చీదిరాల మారేశ్వరరావు, జక్కంపూడి ప్రదీప్, బొంతు సతీష్, పరసా శ్రీను, నెక్కలపు వెంకటేశ్వరరావు (చౌదరి), బన్నే వీరాస్వామి, బొట్టు దుర్గారావు, అవలపాటి శ్రీహరి, రసూల్ దాదా, బస్సు తిరుపతయ్య, గొల్లమందల వెంకటేశ్వరరావు, రాట్నాలు, చేకు పరమేష్, వెల్లంకి నాగ మహేశ్వరరావు, సన్నీ తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.