www.ntodaynews.com
అమరావతి: గుడ్ న్యూస్.. నీట్ పరీక్షార్థులకు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!
ఆంధ్రప్రదేశ్
నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ రాయనున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సౌకర్యం కల్పించింది. జూన్ 21న జరిగే పరీక్ష నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు.
పరీక్ష రోజు రద్దీని తగ్గించేందుకు అదనపు బస్సులు కూడా నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈ నిర్ణయంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల విద్యార్థులకు పెద్ద ఉపశమనం లభించనుంది.