అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవం విజయం
అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవం విజయం - భూమా అఖిల ప్రియా రెడ్డి -
భూమా Algorithm రెడ్డి -ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) చట్టం, 2026కు రాష్ట్రపతి ఆమోదం లభించిన మంగళవారం మన రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాయి. ఈ చారిత్రాత్మక గెజిట్ నోటిఫికేషన్తో అమరావతిని మన ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపించే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, అమరావతి నిర్మాణమే తన శ్వాసగా భావించి అలుపెరగని పోరాటం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ గెలుపులో తమ వంతు కృషి చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలకు మరియు పార్లమెంటులో మన గళానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
ముఖ్యంగా, ఐదు ఏళ్ల పాటు అణచివేతకు గురైనా, మొక్కవోని ధైర్యంతో పోరాడిన అమరావతి రైతన్నలకు ఈ విజయం అంకితం. వారి త్యాగాలు, కన్నీళ్లు మంగళవారం చారిత్రాత్మక విజయానికి పునాదులయ్యాయి. ముఖ్యమంత్రి దూరదృష్టితో, కూటమి ప్రభుత్వ సంకల్పంతో అమరావతిని ప్రపంచ దేశాలు అబ్బురపడే రీతిలో నిర్మించుకుంటాం. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ విజయం!