BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

అమరావతి శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం – చాట్రాయిలో సంబరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 06:58 PM
64 వీక్షణలు

 పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని సమర్థిస్తూ బిల్లు ఆమోదం పొందగా, ఈరోజు రాజ్యసభలో కూడా మూజివాణితో అదే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి సమర్పించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని చాట్రాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బళ్ళా రాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకోవడం రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేసే శుభపరిణామమని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి మండలి సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల కృషి ఎంతో కీలకమని కొనియాడారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.