BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

అమరావతి శాశ్వత రాజధాని బిల్లు ఆమోదం – చాట్రాయిలో సంబరాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Apr, 2026 - 06:58 PM
95 వీక్షణలు

 పార్లమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతిని సమర్థిస్తూ బిల్లు ఆమోదం పొందగా, ఈరోజు రాజ్యసభలో కూడా మూజివాణితో అదే బిల్లును ఆమోదించి రాష్ట్రపతికి సమర్పించే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకొని చాట్రాయి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో బళ్ళా రాజు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి శాశ్వత రాజధానిగా రూపుదిద్దుకోవడం రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేసే శుభపరిణామమని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ఈ విజయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి మండలి సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల కృషి ఎంతో కీలకమని కొనియాడారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అమరావతి అభివృద్ధి ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.