BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 05 September 2026, 07:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అమరావతి: ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
05 Sep, 2026 - 07:41 PM
22 వీక్షణలు

ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి పలు నిర్ణయాలు.. ప్రకటనపై సంతృప్తి వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాల నాయకులు

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించిన అనంతరం పలు అంశాలపై నిర్ణయాలను ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు.

చంద్రబాబు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..

12వ వేతన సవరణ సంఘం నియామకానికి అంగీకారం.

రెండు డీఏలు 2026 అక్టోబర్ 1 నుంచి చెల్లింపు.

2024 జూలై 1, 2025 జనవరి 1 నుంచి రావాల్సిన డీఏల విడుదలకు నిర్ణయం.

2022 సంవత్సరానికి సంబంధించిన సరెండర్ లీవ్ నగదును వచ్చే సంక్రాంతికి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి అంగీకారం.

పోలీసులకు అదనంగా ఒక సరెండర్ లీవ్ నగదును ఈ దసరాకు చెల్లించనున్నారు.

అదనపు పెన్షన్ పరిమాణాన్ని 2027 జనవరి నుంచి అమలు చేయాలని నిర్ణయం.

70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం అదనపు పెన్షన్ వర్తింపు.

ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని క్రమబద్ధీకరించేందుకు నిర్ణయం. వచ్చే నెల నుంచే ప్రతి నెలకు సంబంధించిన చెల్లింపును అదే నెలలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుకు చెల్లించేందుకు అంగీకారం.

ఈ నిర్ణయాల అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,880 కోట్ల అదనపు ఆర్థిక భారం పడనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.