BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

జగిత్యాల–వెల్గటూర్ రూట్‌లో అదనపు బస్సు నడపాలి

తెలంగాణ
02 Feb, 2026 - 03:36 AM
137 వీక్షణలు
  జగిత్యాల–వెల్గటూర్ రూట్‌లో అదనపు బస్సు నడపాలి ఒకే బస్సుతో విద్యార్థులు, నిత్య ప్రయాణికుల అవస్థలు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, డిపో మేనేజర్ స్పందించాలని విజ్ఞప్తి NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల నుంచి వెల్గటూర్ మీదుగా వెళ్లే రూట్‌లో సరిపడా బస్సులు లేక విద్యార్థులు, నిత్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గొల్లపల్లి, వెల్గటూర్ మండలాలకు చెందిన విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేందుకు ఈ మార్గాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. అయితే ప్రస్తుతం ఈ రూట్‌లో ఒకే బస్సు మాత్రమే అందుబాటులో ఉండటంతో ప్రయాణం కష్టతరంగా మారింది. కిక్కిరిసిన బస్సు… ప్రాణాలకు ముప్పు జగిత్యాల–వెల్గటూర్ మార్గంలో రోజూ వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ప్రయాణిస్తుంటారు. బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఉన్న ఒక్క బస్సులోనే ప్రయాణికులు కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. బస్సులో చోటు లేక కొందరు విద్యార్థులు ఫుట్‌బోర్డుపై నిలబడి, ప్రాణాలకు తెగించి ప్రయాణిస్తున్న పరిస్థితి నెలకొంది. సమయానికి బస్సు దొరకక తరగతులకు ఆలస్యమవుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు విజ్ఞప్తి ఈ సమస్యపై స్థానిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ తక్షణమే స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, ప్రయాణికుల భద్రత దృష్టిలో ఉంచుకుని ఈ రూట్‌లో వెంటనే అదనపు బస్సు సర్వీసులు ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. #Jagtial #Velgatur #RTCBus #StudentIssues #PublicTransport #RoadSafety #AdditionalBus #TelanganaNews  Follow us on Website Facebook Instagram YouTube