అనారోగ్య కారణంతో వ్యక్తి ఆత్మహత్య...
అనారోగ్య కారణంతో వ్యక్తి ఆత్మహత్య...
అన్నమయ్య జిల్లా.
చౌడేపల్లి.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి కి చెందిన వడిగల వెంకట్రమణ కుమారుడు గంగాధర్ (45) చిన్నయల్లకుంట్ల సమీపంలో చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మృతుడి బంధువుల కథనం ప్రకారం మంగళవారం మద్యాహ్నం 3 గంటల నుంచి మృతుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉందని, గత రెండుమూడు రోజుల క్రితమే ఆసుపత్రి నుండి ఇంటికొచ్చామన్నారు.
మృతుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చుట్టుప్రక్కల వెతికిన కుటుంబ సభ్యులు, స్నేహితులు బుదవారం ఉదయాన్నే పెద్దయల్లకుంట్ల సమీపంలో చింతచెట్టుకు ఉరివేసుకునిఉన్నట్లు ఆటుగా వెళ్తున్నవారు తెలియజేయడంతో వెళ్ళి చూడగా గంగాధర్ అని తెలుసు కొని పోలీసులకు సమాచారం అందిచారు.
సమాచారం అందిన వెంటనే పోలీసూలు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొన్నారు.