10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు.
ఇటీవల విడుదలైన పదో తరగతి ఇంటర్ - మెరిట్ పరీక్షా ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు దేవవరం గ్రామానికి చెందిన వైబోయిన కుసుమ, తో పాటు 18 మందిని ప్రత్యేకంగా అభినందిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనకాపల్లి లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రత్యేక మొమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌ॥ శ్రీ భరణికాన సాయినాధరావు (బాబూరావు) గారు, అధ్యక్షులు- అనకాపల్లి జిల్లా యాదవ సంక్షేమ సంఘం
గౌ|| శ్రీ కొణతాల రామకృష్ణ గారు, మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు
గౌ|| శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు
గౌ॥ శ్రీ సి.యం.రమేష్ గారు, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు, రైల్వే బోర్డ్ స్టాండింగ్ కమిటీ చైర్మన్
గౌ॥ శ్రీ సి.హెచ్. వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు, విశాఖ సౌత్ శాసనసభ్యులు, జనసేన విశాఖజిల్లా పార్టీ అధ్యక్షులు
గౌ|| శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్
గౌ॥ శ్రీ కోన తాతారావు గారు, చైర్మన్ D.C.C.B. ఉమ్మడి విశాఖజిల్లా
గౌ|| శ్రీ మలసాల భరత్కుమార్ గారు, అనకాపల్లి నియోజకవర్గం, YSRCP ఇన్ చార్జ్
గౌ|| శ్రీ భరణికాన రామారావు గారు, అఖిల భారతీయ యాదవ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు
గౌ॥ శ్రీ దూళి రంగనాయకులు గారు, రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్, యలమంచలి నియోజకవర్గ ఇన్ చార్జ్
గౌ॥ శ్రీ దేవర సత్యనారాయణ గారు, చైర్మన్ పాయకరావుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాల్గొన్నారు.