www.ntodaynews.com
అన్నీ డివిజన్లలో అభివృద్ధి వేగవంతం : మేయర్
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మేయర్ మధుకర్ అన్నారు. ఆదివారం 15వ డివిజన్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను కార్పొరేటర్ శ్రీనుతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కార్పొరేషన్ ముందుకు సాగుతోందన్నారు. ప్రతి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు తదితర అభివృద్ధి పనులు దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు.
స్థానిక ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు