అన్ని రకాల ఎరువుల విక్రయానికి నూతన డిజిటల్ యాప్
అన్ని రకాల ఎరువుల విక్రయానికి నూతన డిజిటల్ యాప్
కేంద్ర ప్రభుత్వం ఎరువుల విక్రయాలను పారదర్శకంగా పర్యవేక్షించేందుకు, బ్లాక్ మార్కెటింగ్ను నిరోధించేందుకు 'ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్స్ అనే కొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది ఇచ్చిందని చిట్యాల వ్యవసాయ అధికారి గిరిబాబు తెలిపారు. చిట్యాల మండలంలో సెప్టెంబర్ 2 నుండి ఈ విధానం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు యాప్ ద్వారా కేవలం యూరియా మాత్రమే అందించగా, ఇకపై డిఏపి, మరియు అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులను ఈ ఒక్క యాప్ ద్వారానే పొందవచ్చు అని రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుండి యాప్ను డౌన్లోడ్ చేసుకుని, ఆధార్ నంబర్ లేదా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ అవ్వాలి అని తెలిపారు. మై ఫామ్ ఆప్షన్లో భూమి వివరాలు కనిపిస్తాయి. వివరాలు లేకపోతే Sync Lands ద్వారా ఎంటర్ చేసుకోవచ్చు. కౌలు రైతులు, రిజిస్ట్రేషన్ ఐడీ లేని వారికి కూడా ఎరువులు పొందే వెసులుబాటు ఉంది.
బుకింగ్ విధానం: పంట రకం, విస్తీర్ణాన్ని బట్టి ఎంత ఎరువు అవసరమో యాప్ ఆటోమేటిక్గా సూచిస్తుంది. దగ్గరలోని డీలర్ను ఎంచుకోగానే 2 రోజుల చెల్లుబాటు ఉండే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది.
ఎరువుల సేకరణ: జనరేట్ అయిన క్యూ ఆర్ కోడ్ మరియు ఆధార్ ఓటిపి ద్వారా రైతు లేదా వారి ప్రతినిధి డీలర్ వద్ద నుండి ఎరువులు తీసుకోవచ్చు.
రైతులు ఈ డిజిటల్ విధానాన్ని అలవాటు చేసుకోవాలని , బుకింగ్ విధానంపై వీడియోలను వాట్సాప్ గ్రూపులు మరియు రైతు వేదికలలోని ఏఈల ద్వారా షేర్ చేస్తామని చిట్యాల మండల వ్యవసాయ అధికారి (MAO) పగిడిమర్రి గిరిబాబు తెలిపారు.