రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి : తీన్మార్ మల్లన్న
రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి : తీన్మార్ మల్లన్న
రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాలి అని ,తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించేది జెన్ జీ యువతేనని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహించిన జెన్ జీ మీట్ అప్ విత్ తెలంగాణ ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా యువత, విద్యార్థులతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖాముఖి నిర్వహించి, వారు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో విద్య, ఉపాధి, సామాజిక న్యాయం వంటి అంశాలపై యువత చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరిగినప్పుడే ప్రజా సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారాలు లభిస్తాయని మల్లన్న పేర్కొన్నారు. కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలకు బంధారపు నర్సయ్య గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సాయి కుమార్, నల్గొండ జిల్లా కన్వీనర్ నాగార్జున్, నాయకులు శివ తదితరులు పాల్గొన్నారు.