BREAKING
రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు
Date of Publish : 02 September 2026, 07:42 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుడిపాడులో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు...

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 07:42 AM
2 వీక్షణలు

గుడిపాడులో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు.. దోమల బెడదతో అనారోగ్యం పాలవుతున్న కుటుంబం

నూజివీడు / గుడిపాడు, సెప్టెంబర్ 02

ముసునూరు మండలం గుడిపాడు గ్రామంలోని మసీదు రోడ్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు సక్రమంగా ప్రవహించకపోవడంతో దుర్వాసన వ్యాపిస్తోందని, దోమలు, ఇతర కీటకాలు పెరిగి వ్యాధుల ముప్పు ఏర్పడుతోందని నూరు బాషా షకూర్ బి ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన కాలువల వ్యవస్థ లేకపోవడంతో ఇళ్లలో ఉపయోగించిన నీరు, వర్షపు నీరు బయటకు వెళ్లే మార్గం లేక అక్కడే నిలిచిపోతున్నాయని తెలిపారు. నిలిచిపోయిన మురుగునీటిలో దోమలు, కీటకాలు వృద్ధి చెంది ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

తమ కుటుంబ సభ్యులందరికీ దోమల బెడదతో జ్వరాలు వస్తున్నాయని, శుభ్రమైన వాతావరణం లేక నిత్యం ఇబ్బందులు పడుతున్నామని షకూర్ బి తెలిపారు. సమస్యను పలుమార్లు తెలియజేసినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ అధికారులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, మురుగునీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం కోరింది.