BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 02 September 2026, 06:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురం: జనసేన ఎమ్మెల్యే పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి

ఆంధ్రప్రదేశ్
/ పశ్చిమ గోదావరి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 06:08 AM
15 వీక్షణలు

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో సమీక్ష సందర్భంగా జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

వేదికపైనే ఎమ్మెల్యే పనితీరును ప్రస్తావించిన చంద్రబాబు.. “మీరు, మీ నియోజకవర్గ అధికారులు సరిగ్గా పని చేయడం లేదు. జిల్లా పరిస్థితి బాగుంది కానీ, నరసాపురం నియోజకవర్గం మాత్రం ఆశించిన స్థాయిలో లేదు” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

నియోజకవర్గ పనితీరుపై వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ.. 25 అంశాల్లో అనుకూల పరిస్థితులు ఉంటే, 23 అంశాల్లో ప్రతికూలతలు ఉన్నాయని, ఇది ఆమోదయోగ్యం కాదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని.. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం.