వేములవాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురికి తీవ్ర గాయాలు
తెలంగాణ
/
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండగట్టు దర్శనం అనంతరం వేములవాడ మీదుగా కామారెడ్డి వెళ్తున్న భక్తుల కారు ప్రమాదానికి గురైంది.
వేములవాడ–జగిత్యాల బస్టాండ్ సమీపంలో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్లో వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.