BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 02 September 2026, 06:08 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కేసీఆర్ కోసం మూడేళ్లలో కోట్ల ఖర్చు.. రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 06:08 AM
7 వీక్షణలు

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలకు కౌంటర్‌గా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.

ప్రజా సమస్యలపై స్పందించకుండా ప్రతిపక్ష నేత పదవిలో కొనసాగడం సరికాదని, వెంటనే రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

వెయ్యి రోజుల్లో కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి: రేవంత్

అంబర్‌పేటలో మూసీ నదిపై రూ.52 కోట్లతో నిర్మించిన నూతన వంతెనను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత వెయ్యి రోజుల్లో కేసీఆర్ ప్రజల కోసం ఒక్కరోజు కూడా బయటకు రాలేదని ఆరోపించారు.

ఒక ఉద్యోగి ఏడాది పాటు పని చేయకపోతే తొలగిస్తారని, కానీ కేసీఆర్ మాత్రం పదవిలో కొనసాగుతూ ప్రభుత్వ సౌకర్యాలు పొందుతున్నారని విమర్శించారు.

జీతం, భద్రత కోసం రూ.24 కోట్లకు పైగా ఖర్చు: సీఎం

కేసీఆర్‌కు గత మూడేళ్లలో జీతంగా రూ.1.84 కోట్లు చెల్లించామని, వాహనాలు, భద్రతా సిబ్బంది కోసం ప్రభుత్వం రూ.22.24 కోట్లకు పైగా ఖర్చు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇంత ఖర్చు చేస్తున్నప్పటికీ కేసీఆర్ ప్రజా సమస్యలపై స్పందించడం లేదని, ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని ఆరోపించారు. ప్రజల కోసం పనిచేయలేని పరిస్థితిలో ఉంటే ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.