వరంగల్లో ఉచిత ఉల్లిగడ్డల పంపిణీలో ఉద్రిక్తత
తెలంగాణ
/
వరంగల్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1,000 రోజులు పూర్తయిన సందర్భంగా వరంగల్లో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో ఉచితంగా ఉల్లిగడ్డల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఉల్లిగడ్డలు తీసుకునేందుకు ప్రజలు ఒక్కసారిగా భారీగా తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఉల్లిగడ్డల కోసం జనం ఎగబడటంతో అక్కడ తోపులాట, గందరగోళం చోటుచేసుకుంది.
పరిస్థితి తీవ్రంగా మారడంతో కాంగ్రెస్ నేత రాజనాల శ్రీహరి అక్కడి నుంచి వెళ్లిపోయారు. భారీగా వచ్చిన జనాన్ని నియంత్రించేందుకు నిర్వాహకులు, పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.