అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన అంబేద్కర్
అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన అంబేద్కర్: నడిపెల్లి దివాకర్ రావు
మంచిర్యాల, ఏప్రిల్ 14:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేశారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కొనియాడారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల నేడు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని పేర్కొన్నారు. సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేనిదని, రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే నేడు అందరికీ సమాన అవకాశాలు అందుతున్నాయని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు