BREAKING
ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి .. ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: - అదనపు ఎస్పీ శ్రీ ఎం. వెంకటాద్రి ..
www.ntodaynews.com

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వనేపాకల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
18 May, 2026 - 05:49 PM
441 వీక్షణలు

NTODAY NEWS చిట్యాల :- వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరక, పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో మనస్తాపానికి గురై ఒక రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిట్యాల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం వనిపాకల గ్రామానికి చెందిన శిరసనగండ్ల వెంకన్న (57) అనే రైతు వ్యవసాయ అవసరాల నిమిత్తం తన ఇంటిపై ఫైవ్ స్టార్ ఫైనాన్స’లో సుమారు 5 లక్షల రూపాయల వరకు  అలాగే తనకు తెలిసిన వారి వద్ద మరో 3 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. అయితే, ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక వెంకన్న తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు అని తెలిపారు. ​ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన, ఆదివారం  రాత్రి  కుటుంబ సభ్యులందరూ పడుకున్న తర్వాత తన ఇంట్లోని రేకుల గదిలో ఉన్న ఇనుప రాడుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ​మృతునికి భార్య సైదమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య సిరిసినగండ్ల సైదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్  మామిడి రవికుమార్ తెలిపారు...