BREAKING
శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు శ్రీశైలంలో వీరశైవ ఆగమ పాఠశాల ప్రవేశ పరీక్ష నిర్వహణ శ్రీశైలంలో కొనసాగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాలు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ నాయకుడి వాలీమా వేడుకలో పాల్గొన్న మాజీ మంత్రి పట్టణంలో వాహనాల తనిఖీలు నిర్వహించిన అర్బన్ ఎస్ఐ హజరత్తయ్య నియోజకవర్గ ఆర్థికాభివృద్ధికి ఆటోనగర్ కేంద్రబిందువు కావాలి : ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పెరిగిన ధరలపై చిలకలూరిపేటలో ప్రజాసంఘాల ధర్నా తెలుగుదేశం పార్టీ రాజ్యసభ స్థానాలు ఎన్నిక డీఈఓ ను సస్పెండ్ చేయాలి. ఏఎస్ఐ రమేష్ నడుపుతున్న కారు ఢీకొని యువకుడు మృతి అతివేగంగా వెళ్తు బోల్తా పడిన కారు
www.ntodaynews.com

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి : ఎంపీ

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
09 Jun, 2026 - 08:12 PM
29 వీక్షణలు

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలి : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, జూన్ 9: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా, జిల్లా అభివృద్ధికి సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామేలు, అనురాగ్ జయంతి, భాస్కర్ రావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, అమలులో ఉన్న పథకాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు అందించారు.

ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఆయా శాఖలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు అమలు చేస్తోందని, వాటిని అధికారులు పూర్తిస్థాయిలో పారదర్శకంగా అమలు చేయాలని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే వివిధ శాఖలకు మంజూరైన అభివృద్ధి నిధులు సద్వినియోగం అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో శ్రీవాణి, మంజుల, అవేజ్ చిస్తీ, రేఖ బాబురావు, వివిధ శాఖల జిల్లా అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.