www.ntodaynews.com
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పై సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు
జాతీయం
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పై సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు
అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పై అవినీతి ఆరోపణలు – రూ.1,270 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ. అధికార దుర్వినియోగం ద్వారా తన బంధువుల కంపెనీలకు అక్రమ కాంట్రాక్టులు కట్టబెట్టాడు అన్నది ప్రశాంత్ భూషణ్ పిటిషన్.
ఈ పిటిషన్ విచారిస్తూ, 15 ఏళ్ల కాలంలో సీఎం తన బంధువులకు ఇచ్చిన ప్రతి కాంట్రాక్టుపై విచారణ జరపాలని, 16 వారాల్లో నివేదిక అందజేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు.
నివేదికకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం.