BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

తెలంగాణ
27 Feb, 2026 - 07:33 AM
151 వీక్షణలు
కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు NTODAY NEWS: కదిరి ప్రతినిధి వినోద్ కుమార్ మార్చి 13 వరకు 15 రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు కదిరి, 27-02-2026: కదిరి పుణ్యక్షేత్రం శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 27 నుండి మార్చి 13 వరకు 15 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేయు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాల విజయవంత నిర్వహణపై కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఉభయదారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు ఆహ్లాదకర వాతావరణంలో, ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలు, తాగునీరు, పారిశుధ్యం, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఉత్సవాల్లో పాల్గొనాలని ఎమ్మెల్యే ఆహ్వానం పలికారు.   #Kadiri #Brahmotsavam #LakshmiNarasimhaSwamy #TempleFestival #AnantapurDistrict Follow us on Website Facebook Instagram YouTube