BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిజెపి శ్రేణుల అరెస్ట్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
23 Mar, 2026 - 10:08 AM
122 వీక్షణలు

అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న బిజెపి శ్రేణుల అరెస్ట్ 

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని నిరసిస్తూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు చేపట్టిన 'అసెంబ్లీ ముట్టడి' కార్యక్రమం చిట్యాలలో ఉద్రిక్తంగా మారింది. సోమవారం ఉదయం హైదరాబాద్‌ తరలివెళ్తున్న బిజెపి నాయకులను చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ నేతృత్వంలో పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ​ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రైతులు, మహిళలు, యువత, మరియు ఉద్యోగులను నిలువునా వంచించిందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 13 డిక్లరేషన్లు, 420 వాగ్దానాలు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, బిజెపి ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో బిజెపి చిట్యాల మండలాధ్యక్షుడు బిజెపి ప్రధాన కార్యదర్శి చుంచు శ్రీను, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెల్ల శ్రీను, పాల రవి వర్మ, బెల్లి నరేష్, మురళీకృష్ణ, నూకేష్ తదితరులు ఉన్నారు.