BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

అతిథుల నిలయం… పందుల తాండవం!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:58 PM
106 వీక్షణలు

అతిథుల నిలయం… పందుల తాండవం!  అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కలకలం

అనంతపురం జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో షాకింగ్ పరిస్థితులు బయటపడ్డాయి. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు రాకపోకలతో రద్దీగా ఉండే ఈ అతిథి గృహం ఇప్పుడు పందుల ఆవాసంగా మారింది. అతిథి గృహ ప్రాంగణంలో డజన్ల కొద్దీ పందులు స్వైర విహారం చేస్తుండటం స్థానికులను, సందర్శకులను కలవరపెడుతోంది. గెస్ట్ హౌస్‌లోకి సైతం ప్రవేశించి, పాడుబడ్డ గదుల్లోనే స్థిరపడిపోయిన పందులు అక్కడే తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కొంతమంది సిబ్బంది, సందర్శకులపై దాడి చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.ఇంత కీలకమైన ప్రభుత్వ అతిథి గృహంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 “మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే స్థలంలో ఇదే పరిస్థితి ఉంటే… సాధారణ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు తక్షణమే స్పందించి శుభ్రత చర్యలు చేపట్టి, పందుల సంచారాన్ని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.