BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

అతిథుల నిలయం… పందుల తాండవం!

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Mar, 2026 - 10:58 PM
73 వీక్షణలు

అతిథుల నిలయం… పందుల తాండవం!  అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో కలకలం

అనంతపురం జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో షాకింగ్ పరిస్థితులు బయటపడ్డాయి. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు రాకపోకలతో రద్దీగా ఉండే ఈ అతిథి గృహం ఇప్పుడు పందుల ఆవాసంగా మారింది. అతిథి గృహ ప్రాంగణంలో డజన్ల కొద్దీ పందులు స్వైర విహారం చేస్తుండటం స్థానికులను, సందర్శకులను కలవరపెడుతోంది. గెస్ట్ హౌస్‌లోకి సైతం ప్రవేశించి, పాడుబడ్డ గదుల్లోనే స్థిరపడిపోయిన పందులు అక్కడే తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కొంతమంది సిబ్బంది, సందర్శకులపై దాడి చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.ఇంత కీలకమైన ప్రభుత్వ అతిథి గృహంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 “మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే స్థలంలో ఇదే పరిస్థితి ఉంటే… సాధారణ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అధికారులు తక్షణమే స్పందించి శుభ్రత చర్యలు చేపట్టి, పందుల సంచారాన్ని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.