అతిథుల నిలయం… పందుల తాండవం!
అతిథుల నిలయం… పందుల తాండవం! అనంతపురం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో కలకలం
అనంతపురం జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో షాకింగ్ పరిస్థితులు బయటపడ్డాయి. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు రాకపోకలతో రద్దీగా ఉండే ఈ అతిథి గృహం ఇప్పుడు పందుల ఆవాసంగా మారింది. అతిథి గృహ ప్రాంగణంలో డజన్ల కొద్దీ పందులు స్వైర విహారం చేస్తుండటం స్థానికులను, సందర్శకులను కలవరపెడుతోంది. గెస్ట్ హౌస్లోకి సైతం ప్రవేశించి, పాడుబడ్డ గదుల్లోనే స్థిరపడిపోయిన పందులు అక్కడే తిరుగుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కొంతమంది సిబ్బంది, సందర్శకులపై దాడి చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.ఇంత కీలకమైన ప్రభుత్వ అతిథి గృహంలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడం అధికార యంత్రాంగ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
“మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చే స్థలంలో ఇదే పరిస్థితి ఉంటే… సాధారణ ప్రాంతాల పరిస్థితి ఎలా ఉంటుందో?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అధికారులు తక్షణమే స్పందించి శుభ్రత చర్యలు చేపట్టి, పందుల సంచారాన్ని అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.