www.ntodaynews.com
అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్య డిస్మిస్
ఆంధ్రప్రదేశ్
అత్యాచారం కేసులో సీఐ చిన్న మల్లయ్య డిస్మిస్
అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న సీఐ చిన్న మల్లయ్యపై పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకుంది. ఆయనను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.
ఏప్రిల్ 29న ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినుకొండలో చిన్న మల్లయ్యపై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. కేసు నమోదైనప్పటి నుంచి ఆయన పరారీలో ఉండగా, ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నట్లు సమాచారం.
ముందస్తు బెయిల్ కోసం చిన్న మల్లయ్య చేసిన ప్రయత్నాలకు కూడా ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించాయి.
కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ డిస్మిసల్ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.