ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం – ఆరుగురు దుర్మరణం
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద నిలిపి ఉంచిన లారీని వెనుక నుండి అతివేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటంతో ఘటన స్థలం హృదయవిదారకంగా మారింది. ప్రమాదానికి గురైన కుటుంబం సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మరణించిన వారు ఆయన సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా పోలీసులు నిర్ధారించారు.
విషయం తెలిసిన వెంటనే బొల్లి రాంమోహన్కు ఫోన్ చేసిన కేటీఆర్ పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పి, అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
అతివేగం, నిర్లక్ష్యం మరోసారి ఆరుగురు ప్రాణాలను బలిగొన్న ఈ ఘటన రహదారులపై భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.