BREAKING
అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా! ఉమాపాక వేంకన్న ఆలయంలో దొంగతనం.... 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం
www.ntodaynews.com

అవినీతి అధికారి.. రూ.6 వేల జీతంతో మొదలై కోటీశ్వరుడిగా!

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
08 Jun, 2026 - 12:19 PM
9 వీక్షణలు

ఒడిశాలో ఓ ప్రభుత్వ ఇంజినీర్ అక్రమాస్తుల కేసులో విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. నెలకు కేవలం ₹6 వేల జీతంతో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ITDA అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) బైకుంఠనాథ్ బెహెరా ప్రస్తుతం కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

అక్రమాస్తులపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో బ్యాంకు లాకర్లలో సుమారు ₹2 కోట్ల విలువైన ₹500 నోట్ల కట్టలు లభించినట్లు సమాచారం.

అంతేకాకుండా వివిధ ప్రాంతాల్లో 5 భవనాలు, 13 ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బంగారం, నగదు, ఇతర పెట్టుబడులు మరియు ఆస్తుల విలువపై ఇంకా లెక్కింపు కొనసాగుతోంది.

అధికారిక ఆదాయానికి మించి భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా తేలడంతో కేసు దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.