BREAKING
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇంటివద్దకే పింఛన్లు అందిస్తున్నాం చింతలపూడిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పేదల సంక్షేమమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వాసం మునియ్య చాట్రాయిలో చిన్నారుల పంచెలు, ఓణీల వేడుకలో పాల్గొన్న మేకా వెంకట ప్రతాప్ అప్పారావు జూన్ 1 నుంచి మారేవి ఇవే ​బాల్క సుమన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా మంచిర్యాలలో బిఆర్‌ఎస్ భారీ ధర్నా ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు
www.ntodaynews.com

భద్రత మాసోత్సవాల్లో అవగాహన కార్యక్రమం

తెలంగాణ
24 Jan, 2026 - 07:55 PM
205 వీక్షణలు
జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో అవగాహన కార్యక్రమం ఆర్టీవో కార్యాలయంలో “శిక్షణతో భద్రత – సాంకేతికత ద్వారా” అంశంపై కార్యక్రమం NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ పట్టణంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా శనివారం ఆర్టీవో కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో “శిక్షణతో భద్రత – సాంకేతికత ద్వారా” అనే అంశంపై ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంవీఐ సుప్రియ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం కేటాయించి తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ అండ్ గ్రీన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత తీసుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న మరణాల్లో సుమారు 70 శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను భారంగా భావించకూడదని, అది తమ కుటుంబానికి ఇచ్చే భరోసా అని అన్నారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరిస్తే సంపూర్ణ రక్షణ లభిస్తుందని చెప్పారు.మద్యం సేవించి వాహనం నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో కార్యాలయ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. #RoadSafety #NationalRoadSafetyMonth #HelmetSafety #TrafficAwareness #SafeDriving #NoHelmetNoRide #MotorVehicleDepartment #Punganur #AndhraPradesh #RoadAccidentPrevention Follow us on Website Facebook Instagram YouTube